‘ఓ..! సుకుమారి’, ఆకట్టుకునే టైటిల్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం టైటిల్ 'ఓ.! సుకుమారి'ని రివిల్ చేశారు. ఆకట్టుకునే పోస్టర్ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. గ్రామ ప్రజలు పరిగెడుతూ…
