‘మెన్షన్ హౌస్ మల్లేష్’ చాలా నిజాయితీగా తీసిన సినిమా. ప్రెస్ మీట్ లో హీరో శ్రీనాథ్ మాగంటి
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ. ఈ సినిమాకి ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్. ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. అద్భుతమైన క్వాలిటీతో బయటికి తీసుకొచ్చారు. సెకండ్ హీరో మా డైరెక్టర్…
