“క్రేజీ కల్యాణం” రూ.100 కోట్లు వసూళ్లు చేసి చరిత్ర సృష్టించాలి – డైరెక్టర్ నందిని రెడ్డి
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ గోరటి వెంకన్న మాట్లాడుతూ - నాకున్న పరిమితులతో చూస్తే నేను సినిమాల్లో ఎక్కువ పాటలు రాసినట్లే లెక్క. ఇది చాలా మంచి సినిమా. ఎలాంటి అశ్లీలత లేకుండా హాయిగా అందరూ చూడొచ్చు…
