‘పాంచ్ మినార్’ సినిమా అంతా చాలా ఫన్ ఉంటుంది: హీరో రాజ్ తరుణ్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పాంచ్ మినార్ ఎప్పుడు మొదలైంది? ఈ కథ ఎలా ఉండబోతుంది ? -సినిమాని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాం. ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. కథ నుంచి బయటికి…
