జనవరి 1న విడుదల కానున్న ‘మదం’
నూతన సంవత్సరం కానుకగా ‘మదం’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన ఎమోషన్స్తో సాగే ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాజీ లేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాలోని ఇంటెన్స్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డు దీనికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. కథ, మాటలను నిర్మాత రమేష్ బాబు కోయ అందించగా, వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ‘ఈగల్’…
