Skip to content

రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా రీ-రిలీజ్

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ట్రైలర్‌తో మళ్లీ ఆ పాత మాస్ ఫీల్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం తన కామెడీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఏప్రిల్ 8, 2026న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనుంది…

Read more

గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్

నగర నడిబొడ్ల సినిమా ధియేటర్ల ప్రారంభం 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 సినిమాస్ థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు…

Read more

ఉగాదికి ‘సీతా పయనం’ ఈరోజు నుంచి Sun NXTలో స్ట్రీమింగ్

తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య అర్జున్‌ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్‌లతో కూడిన ప్రఖ్యాత తారాగణంతో, 'సీతా పయనం' కుటుంబం, ప్రేమ మరియు జీవితంలోని ఊహించని ప్రయాణాల సారాంశాన్ని అందంగా ఆవిష్కరించే గొప్ప వినోదాత్మక చిత్రం. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ మయిన సీన్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ చిత్రానికి ప్రామాణికతను, ఆత్మీయతను జోడించి, మన…

Read more

వేలంటైన్స్ డే స్పెషల్ గా గ్రాండ్ గా రి రిలేజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే

ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన " మనసంతా నువ్వే " చిత్రం 2001 లో విడుదలై, అశేష తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది, రెండొందల యాభై రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్, ప్రధాన పాత్రలు పోషించిన ఈ సున్నితమైన ప్రేమకథా చిత్రానికి వీ.ఎన్.ఆదిత్య తొలిసారి దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 14 వ తేదీన, వేలంటైన్స్ డే సందర్భంగా మరలా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ జెనరేషన్ యూత్ కూడా ఈ…

Read more

శృతి హాసన్ వాయిస్ తో సైలెంట్ స్క్రీమ్స్ – సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్

తెలంగాణలోని యథార్థ సంఘటనలపై ఆధారిత కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ మహిళలపై నేరాలు కేవలం సంఖ్యలుగా మారిపోతున్న కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పేందుకు సన్ నెక్స్ట్ తీసుకొచ్చింది ‘సైలెంట్ స్క్రీమ్స్’. వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఎంత లోతుగా కుటుంబాలు, సమాజాలపై పడుతుందో హృదయాన్ని తాకే విధంగా ఆవిష్కరిస్తుంది. శృతి హాసన్ వాయిస్ నరేషన్‌తో సాగిన ఈ సిరీస్, కేవలం నేరాల వివరాలకే పరిమితం కాకుండా, న్యాయం కోసం సాగే పోరాటాన్ని, బాధితుల మౌన వేదనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ వేళ, జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి…

Read more

ఫస్ట్ ఎవర్ గోట్ ఫైట్ మూవీ జాకీ టీజర్ విడుదల చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ (Jockey)’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు. 2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత, PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డా. ప్రగభల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.ప్రేమ కృష్ణదాస్ - సి దేవదాస్ & జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ ఈ సినిమా కి సంగీతం అందించారు. మధురై నేపథ్యంలో సాగే ‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు…

Read more

డైమండ్ డెకాయిట్ మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి…

Read more