‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది: హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, హీరో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్కు తరచూ వస్తున్నాను. ఇది నాకు నా సొంత ఊరులా మారింది. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులతో మా అనుబంధం మరింత బలపడింది…
