‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ ‘గుండె పేలిపోతోందే’ సాంగ్ రిలీజ్
‘మంగళవారం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ ‘ఉయ్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పీ. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే’ పాటను విడుదల చేశారు. తొలి ప్రేమలో కలిగే…
