Skip to content

72వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల్లో స‌త్తా చాటిన‌ ‘క‌మిటీ కుర్రోళ్ళు’

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్ళు’. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, శ్రీ రాధ దామోద‌ర్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో య‌దు వంశీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌తో పాటు అవార్డుల రేసులోనూ స‌త్తా చాటుతోంది. శ‌నివారం (జూలై 18) రోజున భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 72వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో క‌మిటీ కుర్రోళ్లు సినిమా రెండు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌టంతో పాటు మేక‌ప్ కేట‌గిరిలో (పి.ర‌వికుమార్‌) ఈ సినిమా అవార్డును…

Read more