జూలై 17న ‘వదలా’ మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను – అనిల్ రావిపూడి
ప్రేక్షకులు మా చిత్రాన్ని వదలకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను - ‘వదలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో జగపతి బాబు చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘తెలుగు ఇండస్ట్రీలోకి నిర్మాతగా వస్తున్న కిషోర్ గారికి…
