‘కిష్కిందపురి’ టీజర్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కిందపురి'లో పవర్ ఫుల్ ఎమోషనల్ అవతార్ లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘'కిష్కిందపురి’ టీజర్ మిస్టీరియస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది. మొదటి షాట్ నుంచే ఓ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక వింటేజ్ మాన్షన్లోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఇంతలో రేడియో నుంచి ఒక మెసేజ్ ప్రసారం చేస్తుంది. ఇది కథలో పారానార్మల్ ఎనర్జీ తో పాటు డిఫరెంట్ టైమ్ లైన్స్ ని ప్రజెంట్…