Skip to content

నా జీవితం ఒక తెల్లకాగితం ఎక్కడా ఒక మచ్చ కూడా పడనివ్వను- మురళీమోహన్‌

ఆ నలుగురి వల్లే నేను ఇంత అభివృద్ధి అయ్యాను మాగంటి మురళీ మోహన్‌ ... తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే  ప్రేక్షకులకు పరిచయం..ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.. హీరోగా ,సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు…

Read more
“వేదవ్యాస్ ” లో మురళీ మోహన్ లుక్‌ రిలీజ్ Telugu News

“వేదవ్యాస్ ” లో మురళీ మోహన్ లుక్‌ రిలీజ్

ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో మా "సాయి ప్రగతి ఫిలిమ్స్ " నిర్మిస్తున్న తొలి చిత్రం "వేద వ్యాస్ " లో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన ప్రఖ్యాత నటులు , నిర్మాత మురళీమోహన్ గారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిత్రంలో ఆయన గెటప్ ను రివీల్ చేస్తున్నాము " అన్నారు చిత్ర నిర్మాత, మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ " మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రభోధాత్మక పాత్రలో నటించిన మురళీమోహన్ గారు భారత ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక "పద్మశ్రీ అవార్డు" ను స్వీకరిస్తున్న సందర్భం (జూన్ 23) లోనే…

Read more
వైభవంగా దాసరి లెజెండ్రీ అవార్డ్స్ పంపిణీ Telugu News

వైభవంగా దాసరి లెజెండ్రీ అవార్డ్స్ పంపిణీ

ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ ఏడాది కూడా ఆయన 79వ జయంతిని పురస్కరించుకొని "దాసరి లెజెండరీ అవార్డ్స్" పేరిట అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ నటులు - మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్, సీనియర్ నటీమణి రోజారమణి, సీనియర్ హీరో సుమన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి కామేశ్వరి, వంశీ రామరాజు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు!! 2025…

Read more
“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News

“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందం - రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల…

Read more
చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్ Telugu News

చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం **“ది బ్రేకింగ్ న్యూస్”** తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు”…

Read more
ఘనంగా ప్రారంభమైన “ది సింక్రోనీ” చిత్రకళా ప్రదర్శన Telugu News

ఘనంగా ప్రారంభమైన “ది సింక్రోనీ” చిత్రకళా ప్రదర్శన

నగరంలోని కళాకారుల సృజనాత్మకతకు వేదికగా "ది సింక్రోనీ" చిత్రకళా ప్రదర్శన ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వం ద్వారా త్వరలో "పద్మశ్రీ" పురస్కారాన్ని అందుకోనున్న ప్రముఖ నటులు, పారిశ్రామికవేత్త శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కళాకారిణులు శ్రీమతి శకుంతల బులుసు మరియు శ్రీమతి మల్లిక బులుసు సంయుక్తంగా రూపొందించిన విశిష్ట చిత్రరాజాలను ఈ వేడుకలో ఆవిష్కరించారు. ప్రదర్శన విశేషాలు ముఖ్య అతిథి శ్రీ మురళీమోహన్ గారు గ్యాలరీలోని చిత్రాలను సందర్శించి, కళాకారిణుల ప్రతిభను మనసారా అభినందించారు. చిత్రాలలోని సాంకేతిక నైపుణ్యాన్ని, వస్తు వైవిధ్యతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా: "అబ్ మై నాచూ బహుత్ గోపాల్" "సంభవామి యుగే యుగే" వంటి కళాఖండాలు…

Read more
ఘనంగా తెలుగు సినిమా వేదిక ఉగాది పురస్కారాలు Telugu News

ఘనంగా తెలుగు సినిమా వేదిక ఉగాది పురస్కారాలు

23 చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా సత్కరించిన దత్తాత్రేయ మురళి మోహన్ తెలుగు సినిమా వేదిక ప్రతీ ఏడాది నిర్వహించే ఉగాది నంది పురస్కారాలు ఉగాది మరుసటి రోజు మార్చ్ 20న హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హర్యానా మాజీ గవర్నర్, బి జే పి నేత  బండారు దత్తాత్రేయ, ఉప సభాపతి రామచంద్రులు నాయక్ , సీనియర్ నటులు మురళి మోహన్ , నటుడు పృద్వీరాజ్, హీరో ఆదిత్య ఓం,  ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణా రెడ్డి , దర్శకుల సంఘం అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య, తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు కే .అచ్చిరెడ్డి,…

Read more
పద్మశ్రీ వరించిన సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టీం Telugu News

పద్మశ్రీ వరించిన సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టీం

లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్‌కు కేంద్రం తాజాగా పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మురళీ మోహన్‌కి పద్మశ్రీ ప్రకటించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ‘డొక్కా సీతమ్మ’ టీం ఆయన్ను స్వయంగా కలిసి సన్మానించింది. డొక్కా సీతమ్మ టీం మురళీ మోహన్ ఇంటికి వెళ్లింది. దర్శక, నిర్మాతలు మురళీ మోహన్‌ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని ఆర్టిస్టులు, ఇతర కాస్ట్ క్రూ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్…

Read more
ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం Telugu News

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీనియర్ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్, సంతోషం అధినేత సురేశ్ కొండేటి పవిత్ర శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న వేళ, అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ఇరుముడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమం భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పవిత్ర క్రతువు కొనసాగింది. అయ్యప్ప నామస్మరణతో ఫిల్మ్ నగర్ ఆలయ ప్రాంగణం మారుమోగుతుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగిన ఈ వేడుకలో…

Read more
ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు Telugu News

ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ- మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ-…

Read more