Skip to content

కోలాహలంగా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాలు

శతాధిక చిత్ర నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో ఈ ఏడాది కూడా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాల ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్, ప్రసాద్ లాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళి మోహన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, హీరో సుమన్ గారు, ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, ప్రసన్న కుమార్, అశోక్ కుమార్, దామోదర్ ప్రసాద్, మాజీ మంత్రి, నటులు బాబూమోహన్, బాపుబొమ్మ దివ్యవాణి, అంబికా కృష్ణ, వంశీ రామరాజు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు!!

దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ… వారి పేరిట స్మారక పురస్కారాలు ప్రదానం చేస్తూ… వారిని నేటి తరానికి గుర్తు చేస్తున్న రామసత్యనారాయణను ఎంత ప్రశంసించినా తక్కువేనని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ… “మా రామసత్యనారాయణ ఇప్పటికే ఒకటిన్నర సెచరీకి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఎ ఐ టెక్నాలజీ అందిపుచుకున్నాడు. కాబట్టి సునాయాసంగా మూడు సెంచరీలు చేసి, 300 సినిమాలు తీసిన నిర్మాతగా చరిత్ర సృష్టిస్తాడు” అన్నారు!!

“తన చివరి శ్వాస వరకు దాసరి, కోడి రామకృష్ణలను తాను మర్చిపోనని, ఎవరినీ మర్చిపోనివ్వనని” రామసత్యనారాయణ అన్నారు. “వారిద్దరి చలవ, ఆశీర్వాదం, ప్రోత్సాహంతోనే తాను చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్నానని” ఆయన తెలిపారు. ముఖ్య అతిధులుగా విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రముఖులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు!!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.