డ్యూడ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. -హీరో ప్రదీప్ రంగనాథన్
-ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, కీర్తిశ్వరన్, మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'డ్యూడ్' టాప్ లెవల్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ లాంచ్ లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. సాంప్రదాయ ప్రేమ కథలకంటే భిన్నంగా…
