Skip to content

“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి

71వ జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించింది నటి కస్తూరి. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా బేబి టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది నటి కస్తూరి. ఆమె స్పందిస్తూ - బేబి సినిమా ఒక గేమ్ ఛేంజర్. నేను నా టీనేజ్ అబ్బాయి, అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు మా మధ్య బేబి సినిమా గురించి చర్చ జరిగింది. అని ట్వీట్ చేసింది.

Read more

నేషనల్ అవార్డ్ విన్నర్స్ ని సైమా సత్కరించడం అభినందనీయం: నిర్మాత అల్లు అరవింద్

ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విష్ణు, బృందాకి కంగ్రాజులేషన్స్ .12 ఏళ్లుగా ఈ వేడుకని విజయవంతంగా నిర్వహిస్తూ ఇప్పుడు 13వ ఎడిషన్ కి శ్రీకారం…

Read more