‘సీతా పయనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక, నిర్మాత యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణ…
