Skip to content

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఈ జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్య క్షులుగా యం డి అబ్దుల్, ప్రధాన కార్యదర్శి గా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్ , భాగవతులమురళి కోశాధికారిగా,చదలవాడ భరద్వాజ, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ సి మెంబర్స్ గా గిరిధర్ ,నరసింహ,సాయిరమేష్, RDS ప్రకాష్,అప్పాజీ, నవీన్,గోరంట్ల…

Read more

14 ఏళ్ల తర్వాత లుక్ ఛేంజ్ చేసిన అయ్యప్ప శర్మ

టాలీవుడ్ విలక్షణ నటుడు పూడిపెద్ది అయ్యప్ప శర్మ తన మేకోవర్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తన సిగ్నేచర్ స్టైల్‌ను మార్చుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించే ఈ యాక్టర్, ఇప్పుడు క్లీన్ షేవ్ చేసి పక్కా పోలీస్ ఆఫీసర్‌లా మారిపోయారు. కన్నడలో తెరకెక్కుతున్న 'పబ్బార్' సినిమా కోసం ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అయ్యప్ప శర్మ ఒక పవర్‌ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఒకే ఇమేజ్‌ను మెయింటైన్ చేసిన ఆయన, ఈ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో వెనకాడకుండా తన విజువల్ అప్పీల్‌ను…

Read more

ఘనంగా ఎర్రచీర థ్యాంక్స్ మీట్, యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి బర్త్ డే సెలబ్రేషన్స్

నేటి సినిమాల్లో హారర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ, దానికి "మదర్ సెంటిమెంట్" అనే అరుదైన ఎమోషన్‌ను జోడించి, ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు తెరకెక్కించిన చిత్రం 'ఎర్రచీర-ది బిగినింగ్'. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఎన్‌వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు…

Read more

‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంచ్

సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు. తండ్రి, పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీవిశ్వనాథ్, మిర్చిమాధవి, జబర్దస్త్ ఫేం సత్యశ్రీ, మొగలిరేకులు…

Read more

టికెట్ కొనుక్కుని ‘ఎర్రచీర’ సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రీ…

Read more

ఎర్రచీర’ట్రైలర్‌లోని షాట్‌ను ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: సుమన్ బాబు

ఫిబ్రవరి 6న ఎర్రచీర గ్రాండ్ రిలీజ్.. ‘బీ,సీ సెంటర్స్‌లో ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్ బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్, వెబ్…

Read more

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీనియర్ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్, సంతోషం అధినేత సురేశ్ కొండేటి పవిత్ర శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న వేళ, అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ఇరుముడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమం భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పవిత్ర క్రతువు కొనసాగింది. అయ్యప్ప నామస్మరణతో ఫిల్మ్ నగర్ ఆలయ ప్రాంగణం మారుమోగుతుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగిన ఈ వేడుకలో…

Read more

రాష్ట్రపతిని కలిసిన రోజారమణి, చక్రపాణి

సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త చక్రపాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి నిలయం వేదికగా ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త, ప్రముఖ నటుడు చక్రపాణి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ వార్షిక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ వేడుకకు సినీ పరిశ్రమ నుండి రోజారమణి - చక్రపాణి దంపతులకు ఆహ్వానం అందింది. బాలనటిగా 'భక్త ప్రహ్లాద' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రోజారమణి, నటుడిగా చక్రపాణి భారత రాష్ట్రపతిని కలవడం తమ జీవితంలో ఒక మరపురాని క్షణం అని…

Read more

రాయల్‌ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ ఓటీటీ ఇండియాలో ప్రారంభించిన టిబిడి డిజిటల్‌ ఓటీటీ

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వెండితెర నుంచి బుల్లితెరకు అక్కడి నుంచి మొబైల్‌ ఫోన్‌లకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రేక్షకులను అలరించటానికి అనేక సినిమాలను, వెబ్‌సిరీస్‌లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించటానికి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించటానికి ప్లాన్‌ చేసుకుంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని…

Read more

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం" అని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ,…

Read more