అద్భుతమైన కుటుంబ కథా చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా’
- ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు - తల్లిదండ్రులు, పిల్లలు, మహిళలు తప్పకుండా చూడాల్సిన చిత్రం జానపద గాయనీ కోమలి నిర్మాతగా పరిచయమవుతూ నిర్మించిన తొలి చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే టీజర్, పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలతో కూడిన భావోద్వేగ…
