మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది – హీరో కికు యనమల
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ - ఈ సినిమాకు డైరెక్టర్ వెంకట్ గారు అన్నీ తానై చూసుకున్నారు. అరకు, రంపచోడవరం వంటి లొకేషన్స్ లో కొన్ని చోట్ల సెట్స్ వేసి సినిమా చేశాం. "చిరంజీవి"…
