Skip to content

ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి

వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. "రక్తం యొక్క ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని…

Read more

ఉగాదికి ‘క్రేజీ కల్యాణం’ నుంచి అఖిల్ రాజ్ ఫస్ట్ లుక్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి నటించిన ఉదయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ రాజ్ ట్రెడిషనల్ వేర్ లో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" సక్సెస్ తర్వాత "క్రేజీ కల్యాణం" తనకు…

Read more

ఉగాది శుభాకాంక్షలతో “ఖైగల్” ఫస్ట్ లుక్ విడుదల

పవిత్రమైన ఉగాది పండగ సందర్భంగా, 'ఖైగల్' చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. జై సిద్ధార్థ్ 'దేవ' గా హై-వోల్టేజ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫస్ట్ లుక్‌లో, అగ్ని మరియు గందరగోళం మధ్య రక్తసిక్తమైన యోధుడు ఒక శక్తివంతమైన తిరుగుబాటుకు ప్రతీకగా నిలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సతీ పాత్రలో సుష్మిత సింగ్, నందిని పాత్రలో వాంశీ ఉదయ్ నటిస్తున్నారు. దీనికి యశ్‌విన్ దర్శకత్వం వహించారు. గీతా రమేష్, అక్షర జి.ఆర్, మరియు సంతోష్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రాన్ని, జి.ఆర్ ప్రొడక్షన్స్ మరియు #ఖైగల్ వారియర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందించబడింది. ఈ చిత్రం గురించి దర్శకుడు యశ్‌విన్ మాట్లాడుతూ, “జై సిద్ధార్థ్‌కు…

Read more

ఉగాదికి ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్…

Read more

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి .. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు.

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అంచనాలకంటే భారీ రెస్పాన్స్: సక్సెస్ మీట్

ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చేలా సినిమాని మలిచారు. ముఖ్యంగా…

Read more

ఉగాదికి ‘సీతా పయనం’ ఈరోజు నుంచి Sun NXTలో స్ట్రీమింగ్

తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య అర్జున్‌ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్‌లతో కూడిన ప్రఖ్యాత తారాగణంతో, 'సీతా పయనం' కుటుంబం, ప్రేమ మరియు జీవితంలోని ఊహించని ప్రయాణాల సారాంశాన్ని అందంగా ఆవిష్కరించే గొప్ప వినోదాత్మక చిత్రం. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ మయిన సీన్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ చిత్రానికి ప్రామాణికతను, ఆత్మీయతను జోడించి, మన…

Read more

ఉగాదికి శివ రాజ్‌కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌గా రాబోతోన్న ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల్ని నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపిస్తున్న తీరు, భుజంపై ఆ కండువా? పిడికిలి బిగించిన విధానం, ఆయన లుక్స్ ఇలా అన్నీ కూడా ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. గుమ్మడి నర్సయ్య…

Read more

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్

నేడు (మార్చి 19) టాలీవుడ్ సీనియ‌ర్, లెజెండరీ న‌టుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పుట్టిన రోజు. సినీ పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఇటీవలే యాభై ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచు మోహన్ బాబు అందుకున్న శిఖరాగ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1975లో సినీ కెరీర్‌‌ను ఆరంభించిన మోహన్ బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్ బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు డిఫరెంట్ పాత్రలతో నేటి తరాన్ని మెప్పించబోతోన్నారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో పరిశ్రమకు…

Read more

‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న రిలీజ్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ప్రస్తుతం పలు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తిరువీర్ హీరోగా S.P.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పాపం ప్రతాప్'. పాయల్ రాధకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గ‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిక్ ప్రమోషన్స్ తో ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ నవవధూవరులగా కనిపించడం క్యురియాసిటీ పెంచింది…

Read more