Skip to content

‘ది ప్యారడైజ్’ ‘ఆయా షేర్’ అరుదైన రికార్డ్.. 200 మిలియన్ వ్యూస్ దాటిన బ్లాక్‌బస్టర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'ఆయా షేర్' ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైనప్పటి నుంచి 'ఆయా షేర్' సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కొనసాగుతోంది. సోషల్ మీడియా యూజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, చిన్నారులు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ కోరియోగ్రఫీ, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ పాట సెలబ్రేషన్స్, పబ్లిక్…

Read more

మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు బయలుదేరిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా ఉండనున్నారు. ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది…

Read more

‘శ్రీనివాస మంగాపురం’ లో యాక్షన్, ఎమోషన్స్ చాలా రియల్‌గా ఉంటాయి: హీరో జై కృష్ణ ఘట్టమనేని

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ…

Read more

హీరో యశ్‌ ‘టాక్సిక్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్‌ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ఇక కేవలం నెల రోజులే మిగిలాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తూ మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫియర్, మిస్టరీ, స్టైల్‌ కలగలిసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పోస్టర్‌లో యశ్ ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పొగ, చీకటి కారణంగా ఆయన ముఖం పూర్తిగా కనిపించకుండా మిస్టరీని కొనసాగించారు. ఆయన చేతి మాత్రం రక్తంతో తడిసి ఉండటం, వేళ్ల నుంచి రక్తపు చుక్కలు జారుతూ తెల్లటి షర్ట్‌పై పడటం చూస్తే ఒక టెర్రిఫిక్ యాక్షన్ సీన్ ని…

Read more

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి

తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి గారు, చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణి గారుకి తన తరఫున ₹3 లక్షల…

Read more

హీరో ధనుష్ ‘ఓం’ .. అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఆర్ టేక్ స్టూడియోస్', 'వండర్‌బార్ ఫిలిమ్స్' సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. 'అమరన్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా.. 'వండర్‌బార్ ఫిలిమ్స్' ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు రాజ్ కుమార్ ధనుష్ గారికి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, 'ఆర్ టేక్ స్టూడియోస్'తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో…

Read more

ఈ నెల 31 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు వస్తున్న “దీవాన” మూవీ

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన రీసెంట్ సినిమా "దీవాన" డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. గత నెల 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోనూ ఆకట్టుకునేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో "దీవాన" సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ…

Read more

భారతీయ సినీ పరిశ్రమకు బల్గేరియా రెడ్ కార్పెట్!

▪️యూరప్‌లో కొత్త ప్రొడక్షన్ హబ్‌గా బల్గేరియా ▪️ భారతీయ చిత్ర నిర్మాతలకు సువ‌ర్ణ‌వ‌కాశం ▪️ 'ఆర్ఆర్ఆర్' బల్గేరియా నిర్మాత టోడర్ లాజరోవ్ జుజి ఆహ్వానం హైదరాబాద్: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న వేళ.. యూరప్‌లోని బల్గేరియా దేశం భారతీయ సినీ పరిశ్రమకు కొత్త ప్రొడక్షన్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. తక్కువ నిర్మాణ వ్యయం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక చిత్రీకరణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, విభిన్న సహజ-చారిత్రక లొకేషన్లతో బల్గేరియా భారతీయ చిత్ర నిర్మాతలను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుండి నాయకత్వం వహిస్తున్న టీఎల్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు, 'ఆర్ఆర్ఆర్' సినిమా బల్గేరియా షెడ్యూల్ నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్ టోడర్ లాజరోవ్ జుజి భారతీయ చిత్ర పరిశ్రమతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని…

Read more

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ ట్రైలర్ అదిరిపోయింది: హీరో అడివి శేష్

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా' మంచి థ్రిల్లర్‌. జులై 31న థియేటర్లలో సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో సుమంత్ సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. న్యూటన్స్‌ థర్డ్‌ లా ట్రైలర్ చాలా నచ్చింది. డైరెక్టర్ రాజేష్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఇలాంటి సినిమా తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌లో చాలా మంచి…

Read more

‘శ్రీ శ్రీ’ ఫస్ట్ సింగిల్ బొమ్మ బొమ్మ జూలై 27న రిలీజ్

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇటివల రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. జూలై 27న ఫస్ట్ సింగిల్ బొమ్మ బొమ్మ…

Read more