Skip to content
‘మారెమ్మ’ జూలై లో రిలీజ్ Telugu News

‘మారెమ్మ’ జూలై లో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ టైం పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం 2026 జూలై లో రిలీజ్ కానుంది. ఈసారి బోనాల జాతర థియేటర్లలో దుమ్ములేపబోతున్నాయ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ డివైన్ వైబ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా,…

Read more
“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య Telugu News

“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య

పాన్ ఇండియా స్థాయిలో "బాలన్ - ది బాయ్" సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా..ఇప్పుడు హీరో నాగచైతన్య "బాలన్ - ది బాయ్" సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, "బాలన్ - ది బాయ్" సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. "బాలన్ - ది బాయ్" సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ - ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు…

Read more
$300K ప్రీ సేల్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ స‌మంత ‘మా ఇంటి బంగారం’ Telugu News

$300K ప్రీ సేల్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ స‌మంత ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదలవుతోంది. మ‌న తెలుగు రాష్ట్రాల‌తో పాటు మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్ మార్కెట్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో $300K దాటేయ‌టం విశేషం. టికెట్ బుకింగ్స్ కూడా వేగంగా కొనసాగుతున్నాయి. టికెట్ బుకింగ్స్ ప‌రంగా మా ఇంటి బంగారం సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్, ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మంచి ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆస‌క్తే…

Read more
“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల. Telugu News

“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల

దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం "వెంకట్రామయ్య గారి తాలూకా" ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ... నేను కోమలి ఫోక్ సింగర్ గా నా కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టం తో నేను సినిమా తీయాలి అని ఒక ద్యేయం తో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని "వెంకట్రామయ్య గారి తాలూకా" చిత్రాన్ని పూర్తి చేసాము…

Read more
‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ Telugu News

‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్

- ఇప్పటికే "చెన్నై లవ్ స్టోరీ" రెండు సాంగ్స్ సూపర్ హిట్ - 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' పాటలతో మ్యాజిక్ చేసిన 'మెలొడీ బ్రహ్మ' మణిశర్మ - 'జిగితార..' సాంగ్ పై కూడా మ్యూజిక్ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట 'జిగితార..' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ…

Read more
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది – హీరోయిన్ రాశీ సింగ్ Telugu News

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది – హీరోయిన్ రాశీ సింగ్

వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం నాడు హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. విత్ అవుట్ మేకప్ నటించాను. చాలా వరకు నేచురల్‌గానే కనిపిస్తాను. ఇందులో కంప్లీట్ మదర్ పాత్రలా ఉండదు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే…

Read more
#VenkyAnil5 & #NkrAR2 ఘనంగా ప్రారంభం Telugu News

#VenkyAnil5 & #NkrAR2 ఘనంగా ప్రారంభం

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, 'హిట్ మెషీన్' అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం (#VenkyAnil5 & #NkrAR2) అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి కార్యక్రమాన్ని…

Read more
‘పెద్ది’లో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు జోడింపు- 400 కోట్ల క్లబ్ లో చేరిన పెద్ది Telugu News

‘పెద్ది’లో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు జోడింపు- 400 కోట్ల క్లబ్ లో చేరిన పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి విజయవంతంగా రన్ అవుతోంది. రెండు వారాలుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ పలు రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి మరింత బలంగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు కొత్త సన్నివేశాలను జోడిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి ప్రేక్షకులు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త ఫుటేజ్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. కొత్త సన్నివేశాలు రిపీట్ ఆడియన్స్ మరింత అలరించనున్నాయి. అంతేకాకుండా, ఈ చిత్రం గురువారం నుంచి రెగ్యులర్ టికెట్ ధరలతో అందుబాటులోకి రానుంది. టికెట్ ధరల తగ్గింపు ఫ్యామిలీ ఆడియన్స్…

Read more
కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ Telugu News

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం, తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఓ న్యాయవాదిగా, శ్రేయస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రిగా కనిపిస్తున్నారు. అలాగే శ్రేయస్ కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి ద్వారా, లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఒక తీవ్రమైన సమస్య వెనుక ఉన్న మానవీయ కోణాన్ని పోస్టర్ బలంగా ఆవిష్కరించింది. ముంబై హైకోర్టు నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో, సాక్షుల బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ప్రత్యేక…

Read more
ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్ Telugu News

ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్

ఈ నెల 19న ప్రదర్శితం కానున్న "దీవాన" మూవీ పెయిడ్ ప్రీమియర్స్ యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి "దీవాన" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ…

Read more