Skip to content

‘గోదారి గట్టుపైన’ బంగారు బొమ్మ సాంగ్ మార్చి 13న రిలీజ్

'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, చూడు చూడు, 'ఓ మై గాడ్' సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ బంగారు బొమ్మ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ పాట మార్చి 13న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్…

Read more

శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు – ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్

చెన్నైలో తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ 1998వ సంవత్సరం, నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడి 27 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 'పరాభవ' నామ సంవత్సర ఉగాది పండుగ రోజున 'మహిళా రత్న' మరియు 'బాపు బొమ్మ', 'బాపు రమణ', 'విశిష్ట' ఉగాది పురస్కారాలు మరియు సినీ రంగం-2025 పురస్కారాలను మ్యూజిక్ అకాడమిలో మార్చి 15వ తేది 2026 ఆదివారం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు 2025లో విడుదలైన చలన చిత్రాలలో వివిధ విభాగాలకు సంబంధించిన నటీ నటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను "ఉగాది పురస్కారము"లతో మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులకు "మహిళా రత్న పురస్కారము"తో సత్కరించుటకు కమిటి సభ్యులతో చర్చించి…

Read more

నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాత యష్ రంగినేని

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు యష్ రంగినేని. ఈ రోజు ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇటీవల నటుడిగా కూడా ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో యష్ రంగినేని కీలక పాత్రలో కనిపించారు. ఇందులో మాల వీరయ్య పాత్రలో ఆయన చేసిన నటనకు మంచి స్పందన లభించింది. యష్ రంగినేనితో పని చేసిన కొంతమంది దర్శకులు కూడా ఆయన నటన గురించి ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. ఒక దర్శకుడు మాట్లాడుతూ, “యష్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది…

Read more

సత్యవతిగా రీతు వర్మ గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

మ్యాచో స్టార్ టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ, టి గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్‌లో రీతూ వర్మ అద్భుతమైన గ్రేస్‌తో పాటు ఫియర్స్, కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు…

Read more

ఈటీవీ విన్ నుంచి “ఇంకా ఎం అనుకోలేదు” క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 4న సినిమా విడుదల

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి “ఇంకా ఎం అనుకోలేదు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా వచ్చిన వారి కలయికలోని సినిమాలు వినోదభరితంగా, ప్రత్యేకమైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఇంకా ఎం అనుకోలేదు” చిత్రానికి రచయిత-దర్శకుల జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతా ఈ అనౌన్స్‌మెంట్‌ వీడియోపై, టైటిల్… [12:01 pm, 10/3/2026] Madhu: బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఈటీవీ విన్…

Read more

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో "దీవాన" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "దీవాన" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్ కు…

Read more

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధం అవుతున్న ‘సందిగ్ధం’

డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ‘సందిగ్ధం’ టీం రెడీ అవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీకి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే వరుస అప్డేట్లతో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ‘సందిగ్ధం’ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే వరుసగా అప్డేట్లను రిలీజ్ చేసేందుకు…

Read more

“డార్క్ నైట్” మార్చ్13న థియేటర్లలో రిలీజ్

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి : "పూర్ణ ప్రదాన…

Read more

ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్న ఈటీ విన్ చిత్రాల విజేతలకు అభినందనలు: ఆర్ నారాయణ మూర్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగనగా, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ -మౌనమే నీ భాష, బెస్ట్ డైరెక్టర్ సాయిలు కంపాటి( రాజు వెడ్స్ రాంబాయి), బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ -సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ (రాజు రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ కులకర్ణి (రాజు రాంబాయి)కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భం ఈవిన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో పీపుల్…

Read more

స్టార్ హీరోయిన్ నభా నటేష్ కవర్ పేజీ పబ్లిష్ చేసిన ప్రముఖ మేగజైన్ షీ ఇండియా

ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది. నభా నటేష్ తన యాక్టింగ్ జర్నీతో ఎంతోమంది వుమెన్ ను ఇన్స్ పైర్ చేస్తోందని ఈ సందర్భంగా కవర్ పేజీ స్టోరీలో ప్రచురించారు. నభా తన గ్రేస్, గ్లోరీతో ఆకట్టుకుంటోందని, ఆమె అన్ స్టాపబుల్ గా తన కెరీర్ కొనసాగిస్తోందని షీ ఇండియా మేగజైన్ ప్రశంసించింది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది నభా నటేష్. అందం, ప్రతిభ కలగలిపిన నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ నాయిక్ ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధంలో…

Read more