Skip to content

ఎస్వీబీసీ అధికారులతో టీటీడీ ఛైర్మన్ సమావేశం

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సూచించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ. శరత్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ... "ఛానెల్ నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ప్రకటనలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచాలి, ఇందుకోసం మార్కెటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి" అని సూచించారు. ఈ సందర్భంగా ఛానెల్ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు, కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను…

Read more

‘ది ప్యారడైజ్’ అందరికీ కనెక్ట్ అవుతుంది: చెన్నై ప్రెస్ మీట్‌లో నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ది ప్యారడైజ్ 24న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు థియేటర్ లో మంచి మాస్ ఫిలిమ్‌ని చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో…

Read more

సూర్య ‘సీన్’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్…

Read more

‘ఆకాశంలో ఒకతార’ నవంబర్ 20న రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ మూవీ ‘ఆకాశంలో ఒకతార’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్రకటించారు. ఈ అందమైన సినిమాను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేలా టీమ్‌ భారీ స్థాయిలో డిఫ‌రెంట్ స్టైల్‌ ప్రమోషన్స్‌ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్…

Read more

అక్టోబర్ 16న “రణబాలి” మూవీ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి" షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా…

Read more

SAMANTHA RUTH PRABHU’S CELEBRITY MASTERCHEF TAMIL WELCOMES MASTERCHEF AUSTRALIA WINNER CHEF SASHI CHELIAH AS JUDGE

The kitchen is prepped, the aprons are fastened, and the flavours are all set to sizzle as Chef Sashi Cheliah, winner of MasterChef Australia, joins Celebrity MasterChef Tamil as a Judge. Presented by Sony VIZHA and Sony LIV, the show sees Samantha Ruth Prabhu bring together popular celebrities for a high-energy culinary adventure that blends food, entertainment and drama. Chef Sashi Cheliah’s journey to the MasterChef kitchen has been anything but conventional. Before making his mark in the culinary world,…

Read more

నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సత్కారం

వెర్సటైల్ యాక్టర్ నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా గోవా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోవా గౌరవనీయ గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, డా. నరేష్‌ను ఘనంగా సత్కరించారు. భారతీయ సినీ పరిశ్రమలో 55 ఏళ్ల సుదీర్ఘ, విశిష్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ డా. నరేష్‌ను అభినందించి రాజ్‌భవన్‌లో సత్కరించారు. గోవాలోని తెలుగు కమ్యూనిటీ సభ్యులు డా. నరేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను లోక్‌భవన్‌కు ఆహ్వానించగా, అక్కడ చారిత్రాత్మక భవనాన్ని సందర్శించారు. గౌరవనీయ గవర్నర్ ఆయనకు టీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డా. నరేష్…

Read more

రాకేష్ వర్రే “మాయలేడి” టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ లో "మాయలేడి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మేకర్స్ "మాయలేడి" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్…

Read more

భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు

వినాయక చవితి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం గణేశుడికి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు. వేదపండితులు శ్రీ. పరాశర. శ్రీరామ బట్టాచార్యా గార్ల ఆధ్వర్యంలో పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా గణ నాథుడిని ప్రత్యేకంగా అలంకరించారు. అపార్ట్‌మెంట్‌వాసులతో పాటు పిల్లలు కూడా ఈ పూజల్లో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. గణేశుడి పూజ అనంతరం అపార్ట్‌మెంట్స్‌వాసులకు తీర్థ, ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ఆర్‌ఐ నర్వ స్వాతి, లోకేశ్వర్‌ రెడ్డి–శారదా దేవి, చత్రేష్‌ రెడ్డి–కార్తికేయ రెడ్డి, చైతన్యా రెడ్డి–ఇందిరా ప్రియదర్శిని, మోక్ష ఆదిత్య రెడ్డి–కావిన్య రెడ్డి, దేవి వల్లభనేనితో పాటు పలువురు స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్‌వాసులు పాల్గొన్నారు.

Read more

ముద్దం న‌రసింహ‌స్వామిని స‌త్క‌రించిన‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వైస్‌ ఛాన్సలర్ డా. జేఎం వ్యాస్‌

▪️‘ఏఐ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తకంపై డా. జేఎం వ్యాస్‌ ప్రశంసలు ▪️ జర్నలిజంలో ఏఐ, మెటావర్స్‌ ప్రాధాన్యాన్ని వివరించిన వైస్‌ ఛాన్సలర్‌ ▪️ ముద్దం నరసింహ స్వామిని శాలువాతో సత్కరించిన డా. జేఎం వ్యాస్‌ ▪️ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో మెటావర్స్‌ అధ్యాయం బోధిస్తున్నట్లు వెల్లడి హైద‌రాబాద్ / గాంధీనగర్ (గుజ‌రాత్): ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తక రచయిత, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహ స్వామిని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జేఎం వ్యాస్‌ అభినందించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందంతో వైస్‌ డా. జేఎం వ్యాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముద్దం…

Read more