ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్
ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక…
