‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్ను వస్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది : సమంత
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్, నందినీ రెడ్డి, శ్రీముఖి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సమంత మాట్లాడుతూ ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నాకు సింక్ కాలేదు. దీన్నే ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటారు. ప్రతి సినిమాతో బెటర్…
