మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్బండ్లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు.. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ…
