‘గోదారి గట్టుపైన’ సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: నిర్మాత అభినవ్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి? -నేను 10 ఏళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నాను. నాకు సినిమా అంటే ప్యాషన్ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్న సమయంలో సుభాష్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను యూనివర్సల్గా అందరికీ…
