తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘రెటీనా’ చిత్రం ప్రారంభం
అల్లం రాజు దర్శకత్వంలో మనీష్, సోనియానాయుడు, ప్రీతీ హెస్సోనా హీరో హీరోయిన్లుగా పార్వతి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా జరిగిన ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మూహూర్తం షాట్ పై క్లాప్ నివ్వగా, 'రజాకార్' దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు 'కమిటీ కుర్రోళ్ళు'ఫేమ్ యశ్వంత్ పెండ్యాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి పార్వతి నిర్మాత. ఈ సందర్బంగా 'రజాకార్' దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ ... ఈ సినిమా కథ నేను విన్నాను. చాలా బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కథతో ప్రయాణం చేస్తారు. సినిమా దర్శకుడు…
