కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని “లిటిల్ హార్ట్స్” ప్రూవ్ చేసింది – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సాయి రాజేశ్
"లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ - '"లిటిల్ హార్ట్స్" సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, "లిటిల్ హార్ట్స్" బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో…
ఈ ఘనత నా ఒక్కడిదే కాదు మన టాలీవుడ్ లో ప్రతి ఒక్కరిది!!
ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం నిర్మాతగా డబుల్ సెంచరీ సాధించడం నా జీవితాశయం -వరల్డ్ రికార్డ్ హోల్డింగ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డా: డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు!! తన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని తుమ్మలపల్లి పేర్కొన్నారు. అయితే ఈ ఘనత…
“లిటిల్ హార్ట్స్” సినిమా టీమ్ కు “టూరిస్ట్ ఫ్యామిలీ” మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సూపర్ హిట్ మూవీ "టూరిస్ట్ ఫ్యామిలీ"…
మిరాయ్ గూస్బంప్స్ గ్యారెంటీ మూవీ. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. అందుకే టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులో ఉంచాం: ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజ సజ్జా
మిరాయ్ లో మనోజ్ 2.o చూస్తారు. ఖచ్చితంగా సినిమా గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా…
‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది? -నా ఫస్ట్ సినిమా చావు కబురు చల్లగా. ఆ సినిమా తర్వాత గీత ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఒక సందర్భంలో నిర్మాత సాహు గారికి ఈ కథ…
భద్రకాళి’ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
హీరో విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'భద్రకాళి'తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు…
ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అధికారులు ఆయన గౌరవార్థం స్టాక్ ఎక్స్చేంజ్లోని ఘంటా మోగించే అవకాశం కల్పించారు. ఈ గర్వకారణమైన ఘట్టం స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు NSEలో ఘంటా మోగించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ నటుడు మరియు సినీ ప్రముఖుడు అనే విశిష్ట గౌరవాన్ని పొందారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక ప్రముఖ నటుడు మరియు ప్రజా ప్రతినిధిగా ఆయన స్థాయికి లభించిన గుర్తింపుతో పాటు, సినిమా, సేవా కార్యక్రమాలు మరియు కార్పొరేట్…
తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” సినిమా రూపొందిస్తున్నాం – మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. "ఏ మాస్టర్ పీస్" సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ రోజు "ఏ మాస్టర్ పీస్" షూటింగ్ కవరేజ్ కు మీడియా మిత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు…
డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం చిలకా ప్రొడక్షన్స్ లో రాగ్ మయూర్ హీరోగా ప్రారంభం !!!
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, సృజనాత్మక కథలకు పేరుగాంచాడు, 2022 కామెడీ DJ Tillu తో విజయవంతంగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ సంచలనంగా మారింది మరియు ఆ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారింది. ప్రతిభావంతులైన దర్శకుడు చిన్న విరామం తర్వాత తిరిగి వచ్చాడు, అన్ని సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతను మరో వింత పాత్రను క్రేజీ విధంగా సృష్టించడానికి మరియు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. చిత్రనిర్మాత ఇప్పుడు చిలకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న తన తదుపరి ప్రాజెక్ట్తో తిరిగి వచ్చాడు. ఇటీవల మేకర్స్ విమల్ కృష్ణ మరియు సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల నటించిన సరదా వీడియోతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది…
