‘ది ఇండియా స్టోరీ’ కొత్త పోస్టర్ రిలీజ్
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ది ఇండియా స్టోరీ' నుంచి మేకర్స్ మరో పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. దేశంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న పెస్టిసైడ్ వ్యవసాయం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఈ పోస్టర్, సినిమా చెప్పబోయే బలమైన సందేశాన్ని మరోసారి హైలైట్ చేస్తోంది. మనం ప్రతిరోజూ తినే ఆహారం వెనుక దాగి ఉన్న ప్రమాదాలను ఆలోచింపజేసేలా ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. కొత్తగా విడుదలైన పోస్టర్లో పెస్టిసైడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని బలంగా చూపించారు. ఆలోచింపజేసే విజువల్ డిజైన్తో రూపొందిన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సమాజానికి ఎంతో కీలకమైన అంశాన్ని ఎమోషనల్, థ్రిల్లింగ్ కథతో ప్రేక్షకుల…
