CMRF చెక్కుల పంపిణీ
ఏలూరు క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 పైగా లబ్ధిదారులకు CMRF ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
