హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ
ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా చాటింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత వాలీబాల్ జట్టు మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇది దేశంలో వాలీబాల్ ఆటకు మరింత ఆదరణ తీసుకురానుంది. భారత వాలీబాల్ జట్టు ఈ అద్భుత విజయం సాధించడం వెనక పలు నగరాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ఫ్రాంఛైజీలు, ఆ ఫ్రాంఛైజీలతో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాంటి…
