మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత…
ఘనంగా సైన్స్ ఫెయిర్

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్ఐ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్చార్జ్ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ పుష్ప, ఐపీఎల్ ఇన్చార్జ్ బాలరాజు, సి–బ్యాచ్ ఇన్చార్జ్ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు














