మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా బి.ఎస్. రావు 3వ వర్ధంతి
శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్. రావు 3వ వర్ధంతిని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘ బి.ఎస్. రావుగారి ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని బి.ఎస్.రావు ఆదర్శాలు, విద్య పట్ల వారి అంకితభావాన్ని ప్రతిబింబించే అందమైన చిత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్ ఆర్, ప్రిన్సిపాల్…
