జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
▪️ భానుచందర్, సునీత, సీ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల ▪️ ఆకాష్–భైరవి జోడీతో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు…
