‘గోదారి గట్టుపైన’ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి : హీరో సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్ యూ. లైలా మేడమ్ గారు ఎప్పుడు సెట్లోకి వచ్చినా వెయ్యి స్మైల్ ఎమోజీలు సెట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా పాజిటివ్గా ఉంటారు…
