‘శంబాల’ బ్లాక్బస్టర్ కాంబో మళ్లీ రెడీ.. ఆది హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచారు. ‘శంబాల’ లాంటి మరో వినూత్నమైన కథాంశంతో వీరంతా కలిసి ఓ ప్రయోగం చేయబోతోన్నారు. యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో మరో సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ‘శంబాల’ తరువాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాని నిర్మించాలని వీరంతా కలిసి కథాన్వేషణలో పడ్డారు. ఇక అద్భుతమైన కథ తోడవ్వడంతో వీరంతా కలిసి ముందుకు వచ్చారు. ఎమోషన్స్తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్ను సరికొత్తగా చూపించబోతోన్నారు. భయం, ఉత్కంఠ, అన్ లిమిటెడ్…
