లెజండెరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎమ్.కీరవాణి ఆలపించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రంలోని వెళ్లేదారిలో.. పాట విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రం నుంచి ఇటీవల టీజర్ను విడుదల చేశారు. టీజర్కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ పాటను విడుదల చేశారు. చందు రవి…
