‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విడుదల
విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరిహరన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించారు. గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్.రావు, డా. రాచమల్ల శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించగా, పీ.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా…
