‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో ఎంఎం కీరవాణి
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నా మిత్రులు అనిల్ గారు ప్రవీణ కోసం ఈ వేడుకకి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని గ్లింప్స్ చూశాను…
