Skip to content
“తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ Telugu News

“తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ

డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన "తెలంగాణ సినీ ప్రస్థానం" పుస్తక పరిచయ సభ ఈ రోజు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ క ల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కె.వి. విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా, దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్ వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. "తెలంగాణ సినీ ప్రస్థానం" పుస్తకాన్ని ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత…

Read more