హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా పోస్టర్ లాంఛ్
శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా "పెళ్ళైంది కాని NO కహాని". ఈ చిత్రంలో స్మిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర పోస్టర్ ను హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీహరి మాట్లాడుతూ - ఈరోజు మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన హీరో రాజ్ తరుణ్ గారికి థ్యాంక్స్. అలాగే గెస్ట్ గా వచ్చిన ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి…
