‘సందిగ్ధం’ చిత్రం ఘన విజయం సాధించాలి : తమ్మారెడ్డి భరద్వాజ్
సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమాని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ అనే టైటిల్ చాలా బాగుంది. ఈ మధ్య అసలు…
