$300K ప్రీ సేల్స్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదలవుతోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్ మార్కెట్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ-సేల్స్లో $300K దాటేయటం విశేషం. టికెట్ బుకింగ్స్ కూడా వేగంగా కొనసాగుతున్నాయి. టికెట్ బుకింగ్స్ పరంగా మా ఇంటి బంగారం సినిమాకు వస్తోన్న రెస్పాన్స్, ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తే…
