‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్లో సినిమా రాలేదు: నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ
ఫహాద్ ఫాజిల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో.. నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘ఫహాద్ ఫాజిల్ గారితో సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ చూసే ఉంటారు. అందరికీ నచ్చే ఉంటుంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మనసుకు హత్తుకునే చిత్రం. ఇకపై నుంచి రాబోయే కంటెంట్ని…
