‘శంబాల’కి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వస్తోంది – దర్శకుడు యుగంధర్ ముని
వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ప్రీమియర్లతో మొదలైన పాజిటివ్ టాక్తో డే వన్ అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోండటంతో దర్శకుడు యుగంధర్ ముని శుక్రవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. ‘శంబాల’ ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైంది? మూడేళ్ల క్రితం ఈ పాయింట్ అనుకున్నాను. నాకు రాజశేఖర్ గారితో ఐదేళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ పాయింట్ను ఆయనకు చెప్పాను. ఆ కథ నిర్మాత గారికి చాలా నచ్చింది. ఆ…
