మెదక్ జిల్లాలో పర్యటించిన నటుడు విష్ణు మంచు
మెదక్, తెలంగాణ: ప్రముఖ నటుడు విష్ణు మంచు, మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి ఆహ్వానం మేరకు మెదక్ జిల్లాలో ఒకరోజు పర్యటించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, జిల్లాలోని పలు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ కోట, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ కేథడ్రల్లను సందర్శించారు. అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు, మెదక్ జిల్లాకు అపారమైన పర్యాటక, సినీ చిత్రీకరణ అవకాశాలు ఉన్నాయని అన్నారు…
