Skip to content

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి .. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు.

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అంచనాలకంటే భారీ రెస్పాన్స్: సక్సెస్ మీట్

ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చేలా సినిమాని మలిచారు. ముఖ్యంగా…

Read more

ఉగాదికి ‘సీతా పయనం’ ఈరోజు నుంచి Sun NXTలో స్ట్రీమింగ్

తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య అర్జున్‌ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్‌లతో కూడిన ప్రఖ్యాత తారాగణంతో, 'సీతా పయనం' కుటుంబం, ప్రేమ మరియు జీవితంలోని ఊహించని ప్రయాణాల సారాంశాన్ని అందంగా ఆవిష్కరించే గొప్ప వినోదాత్మక చిత్రం. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ మయిన సీన్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ చిత్రానికి ప్రామాణికతను, ఆత్మీయతను జోడించి, మన…

Read more

ఉగాదికి శివ రాజ్‌కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌గా రాబోతోన్న ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల్ని నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపిస్తున్న తీరు, భుజంపై ఆ కండువా? పిడికిలి బిగించిన విధానం, ఆయన లుక్స్ ఇలా అన్నీ కూడా ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. గుమ్మడి నర్సయ్య…

Read more

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్

నేడు (మార్చి 19) టాలీవుడ్ సీనియ‌ర్, లెజెండరీ న‌టుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పుట్టిన రోజు. సినీ పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఇటీవలే యాభై ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచు మోహన్ బాబు అందుకున్న శిఖరాగ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1975లో సినీ కెరీర్‌‌ను ఆరంభించిన మోహన్ బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్ బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు డిఫరెంట్ పాత్రలతో నేటి తరాన్ని మెప్పించబోతోన్నారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో పరిశ్రమకు…

Read more

‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న రిలీజ్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ప్రస్తుతం పలు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తిరువీర్ హీరోగా S.P.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పాపం ప్రతాప్'. పాయల్ రాధకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గ‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిక్ ప్రమోషన్స్ తో ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ నవవధూవరులగా కనిపించడం క్యురియాసిటీ పెంచింది…

Read more

తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటించింది. ధురంధర్, లోకాహ, కాంతారా, లాలో, రుద్ర, మిరాయి చిత్రాలు నామినేషన్స్‌లో ముందంజలో నిలిచాయి. ఫైనల్ విజేతలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహించే ఇండస్ట్రీ బాడీస్ ఎంపిక చేయనున్నాయి. ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్సీఏ) తన తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించింది. భారతీయ సినిమా విభిన్న రంగాల్లో ఉన్న ప్రతిభను ఒకే వేదికపై గుర్తించి గౌరవించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. భారతదేశంలోని పలు భాషల సినిమా రంగాల మధ్య కలయికను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పడిన ఐఎన్సీఏ, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, పరిశ్రమ సంస్థలను ఒకే అకాడమీ కిందకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ…

Read more

రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన భారత క్రికెటర్ తిలక్ వర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించడంతో ఈ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ పెద్ది షూటింగ్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో ఆ రోజు సెట్స్‌లో సెలబ్రేషన్ వాతావరణం కనిపించింది. తిలక్ వర్మను టీమ్ ఆత్మీయంగా స్వాగతించింది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్…

Read more

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 'నో వే హోమ్' సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని…

Read more

2026లో మా బ్యానర్ లో ఓ పెద్ద సినిమా ఉంటుంది: నిర్మాత రాజేశ్ దండా

హాస్య మూవీస్ బ్యానర్ పై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన సక్సెస్‌ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధాన పాత్రలో “బ్లాక్ గోల్డ్” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు. ఉగాది, మీ బర్త్‌డే ఒకేరోజు రావడం ఎలా అనిపించింది? -ఉగాది, నా బర్త్‌డే ఒకేరోజు రావడం చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. కొత్త సంవత్సరంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్, దాదాపు 15 ఏళ్ల తర్వాత…

Read more