Skip to content
మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ Telugu News

మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ సందర్భంగా నందమూరి అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, గెలిచిన అనంతరం అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ద్వారా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు,ప్రజా ప్రతినిధులు, సినిమా నటులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.. మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ యావత్తు తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకున్న…

Read more
నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక”  మొదటి షెడ్యూల్ పూర్తి Telugu News

నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక” మొదటి షెడ్యూల్ పూర్తి

మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి - రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు. తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు Chitram…

Read more
“వైల్డ్” సినిమా  ఫస్ట్  లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్ Telugu News

“వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న వయోలెంట్ సైకో థ్రిల్లర్ మూవీ* వెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో "వైల్డ్" అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పీట్ల నిర్మించనున్నారు. త్వరలో "వైల్డ్" మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వైల్డ్" మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర…

Read more
“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News

“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందం - రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల…

Read more
నటుడు & సేవామూర్తిగా అఫ్సర్ ఆజాద్ Telugu News

నటుడు & సేవామూర్తిగా అఫ్సర్ ఆజాద్

హైదరాబాద్: ఒకవైపు వెండితెరపై తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు నిజ జీవితంలో పేదలకు అండగా నిలుస్తున్నారు ప్రముఖ నటుడు, సామాజికవేత్త అఫ్సర్ ఆజాద్. స్వయంకృషితో వ్యాపారవేత్తగా ఎదిగి, సినిమాల్లో సత్తా చాటుతూ, సేవా కార్యక్రమాలతో సమాజానికి తన వంతు తిరిగి ఇస్తున్న అఫ్సర్ ఆజాద్ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. నేపథ్యం, విద్యాభ్యాసం అఫ్సర్ ఆజాద్ 1983 జూన్ 5న వికారాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎండి బాబుమియా, రజియాబేగం. బీఏ (B.A) వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, చిన్న వయసులోనే బాధ్యతలు భుజాన వేసుకుని శ్రమను నమ్ముకున్నారు. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి.. 1998లో తన 15వ ఏటనే మోతీనగర్‌లో ఓ సమోసా కంపెనీని ప్రారంభించి వ్యాపార రంగంలోకి…

Read more
చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్ Telugu News

చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం **“ది బ్రేకింగ్ న్యూస్”** తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు”…

Read more
శ్రీకాకుళంలో  ‘గోయాజ్’   జ్యువెలరీ స్టోర్   ప్రారంభo Telugu News

శ్రీకాకుళంలో ‘గోయాజ్’ జ్యువెలరీ స్టోర్ ప్రారంభo

నటి నేహా శెట్టి చేతుల మీదుగా గోయాజ్ 25వ (సిల్వర్ జూబ్లీ) స్టోర్ ప్రారంభోత్సవం. భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన 'గోయాజ్' (GOYAZ), తన విజయయాత్రలో భాగంగా 25వ మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో తన సిల్వర్ జూబ్లీ స్టోర్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ సినీ నటి నేహా శెట్టి ఈరోజు (ఏప్రిల్ 11) ఉదయం 10:41 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న గోయాజ్, వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన డిజైన్లు, మునుపెన్నడూ చూడని…

Read more
17న  “కాలగమనం” సినిమా  రిలీజ్ Telugu News

17న “కాలగమనం” సినిమా రిలీజ్

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "కాలగమనం". సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ - "కాలగమనం" సినిమాను మా డైరెక్టర్ సుధాకర్ బుర్రి గారు బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసే టైమ్ లో అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశాను. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా…

Read more
ఘనంగా “అహోం” మూవీ ప్రారంభం Telugu News

ఘనంగా “అహోం” మూవీ ప్రారంభం

వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా "అహోం". ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - డైరెక్టర్ ప్రసాద్ రాజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా పలు భాషల్లో రూపొందడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావడం లేదు. హిందీతో…

Read more
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల Telugu News

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాల గమనం’. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే నిర్మాత ఏఎమ్ రత్నం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదలవుతుందని చెబుతూ చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ.. ‘‘లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం గారు మా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్ చాలా మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం…

Read more