‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి ‘వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్
- కొన్ని గ్రామాలు రహస్యాలను కాపాడుకుంటే.. మరికొన్ని వాటి మీదనే నిర్మింపబడ్డాయి.. తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది. అదే ‘మర్మదేశం అనే ప్రపంచం నుంచి ‘వీరభద్రుని రహస్యం’. ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజన్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కల్ట్ మిస్టరీ సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తెలుగు ఐఎండీబీ హయ్యస్ట్ రేటింగ్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్లో.. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి..భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడిపై…
