‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు – నిర్మాత శరత్ చంద్ర నాయుడు
మా సిరీస్ ఫ్యామిలీ అందరికీ నచ్చేస్తోంది - ‘గుర్తుకొస్తున్నాయి’ సక్సెస్ మీట్లో హీరో విరాజ్ అశ్విన్ విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా శరత్ చంద్ర నాయుడు నిర్మించిన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. ఈ సిరీస్ను వినోద్ గాలి తెరకెక్కించారు. రోహిణి హట్టంగడి, శివ నారాయణ నరిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ, వివా రాఘవ, పవన్ సిద్దు, గోదావరి గోపి, అనీష్ కురువిల్లా, మేఘన సునీల్, గఫూర్, మధు స్టీవ్, రామ్ చరణ్, చక్రి, సైమన్ తదితరులు ఈ సిరీస్లో ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్లో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సక్సెస్ మీట్లో.. విరాజ్ అశ్విన్…
