‘రాజా ది రాజా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్గుడ్ ఎంటర్టైనర్: నిర్మాత కె. నిహారిక దాసరి
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మారాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను…
