‘రాజా ది రాజా’ జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్
యూత్ఫుల్ ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్లో మంచి బజ్ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో…
