Skip to content

ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి Telugu News

ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ తెలుగు కామెంటేటర్స్ కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఎస్ కే ప్రసాద్ క్రికెట్ అనుభవాలు, ఐపీఎల్ కు ఆయన చేసిన కామెంటరీ స్టైల్ వంటి అంశాలపై మాట్లాడుతూ ఫన్నీగా ఎపిసోడ్ సాగింది.
బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ గా పనిచేసిన ఎంఎస్ కే ప్రసాద్ తన క్రికెట్ కెరీర్ లోని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చీఫ్ సెలెక్టర్ గా ధోని, సచిన్, విరాట్ కొహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్స్ తో తనకున్న అనుబంధం, మ్యాచ్ ల సందర్భంగా మనకు తెలియని సందర్భాలను వెల్లడించారు.
ఇలా క్రికెట్ ముచ్చట్లు, ఎంగేజింగ్ గేమ్స్, ఫన్ తో సర్కార్ తాజా ఎపిసోడ్ లో ఐపీఎల్ వైబ్ కనిపించింది. క్రికెట్ దిగ్గజాలను షోకు తీసుకురావడం వల్ల క్రికెట్ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం ఆహా చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.