Skip to content

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన ప్రచార కార్యక్రమాలకు తోడ్పడిన అనంతరం, ఇప్పుడు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలో విజయవంతంగా అడుగుపెట్టారు.

ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సీరిస్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. ఈ వెబ్‌సీరిస్‌కు ప్రేక్షకుల నుంచి
అనూహ్యమైన స్పందన వస్తోంది. నిర్మాతగా ఆయన ప్రయాణానికి మంచి శుభారంభాన్ని అందించింది. ఈ సిరీస్‌ను నిర్మించడం మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్ మరియు రచయితల బృందంతో కలిసి సిరీస్‌లోని పలు భాగాలకు రచనలో కూడా శరత్ చంద్ర నాయుడు కీలక సృజనాత్మక సహకారం అందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలపై, కథనంపై ఆయనకు ఉన్న అవగాహన తెరపై ప్రతిబింబిస్తూ, ఈ ప్రాజెక్ట్‌లో ఆయన పాత్రకు మరో కోణాన్ని జోడించింది.

ఈ వెబ్ సిరీస్ ఎలా ప్రారంభమైంది?

ఈ ప్రయాణం నా ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్ పేజ్ ‘రేలంగి మావయ్య’తో ప్రారంభమైంది. అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా స్వరంలో పంచుకుంటుంటాను. కాలక్రమేణా ఆ పేజ్‌కు ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ లభించింది. ఆ కాలంలో పెరిగిన వారితో బలమైన అనుబంధం ఏర్పడింది.

గుర్తుకొస్తున్నాయి సీరిస్‌తో నిర్మాతగా మారటానికి కారణం ఏమిటి?
ఆ కంటెంట్‌ను చూసిన తర్వాత ఈటీవీ విన్‌కు చెందిన సాయి గారు, నితిన్ గారు ఆ భావోద్వేగాలను వెబ్ సిరీస్‌గా మలిచే అవకాశం ఉందని భావించారు. అలా ‘గుర్తుకొస్తున్నాయి’ పుట్టుకొచ్చింది.

గుర్తుకొస్తున్నాయికు వస్తున్న స్పందన ఎలా ఉంది?
ఈ మైలురాయిని మరింత ప్రత్యేకంగా నిలిపింది అల్లు అర్జున్ నుంచి లభించిన ప్రోత్సాహం. నా కొత్త ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసిన ఐకాన్ స్టార్, నన్ను వ్యక్తిగతంగా అభినందించడంతో పాటు బహిరంగంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నాళ్లుగానో తనతో కలిసి పనిచేసిన టీమ్ సభ్యుల్లో ఒకరు నిర్మాతగా తొలి అడుగు వేయడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్‌ ఎంకరైజ్‌ చేశారు. ఈ సంఘటన మా ఇద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని, అలాగే అల్లు అర్జున్ క్యాంప్‌లో ప్రతిభను ప్రోత్సహించే సంస్కృతిని ప్రతిబింబించింది.

ఈ విజయంతో మీలో కలిగిన కాన్ఫిడెన్స్‌ ఎలా ఉంది?
విజయవంతమైన సినిమా ప్రచార కార్యక్రమాల రూపకల్పన నుంచి రచన, నిర్మాణం, హృదయాన్ని తాకే కథను తెరపైకి తీసుకురావడం వరకు శరత్ చంద్ర తన ప్రయాణం మార్కెటింగ్‌కే పరిమితం కాదని నిరూపించారని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. ‘గుర్తుకొస్తున్నాయి’ విజయంతో అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాతగా వచ్చారు అనడం, సినీ నిర్మాణ రంగంలో ఇది నా న్యూ జర్నీ కి శ్రీకారం అని అందరూ భావిస్తున్నారు.

సినిమా మార్కెటింగ్‌లోని మీ అనుభవం నిర్మాతగా మీకు ఉపయోగపడిందా?

శరత్ చంద్ర: ఖచ్చితంగా. మార్కెటింగ్ నాకు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారు, వారిని నిజంగా ఏది ఆకట్టుకుంటుందో నేర్పింది. ఆ అవగాహన వల్ల రచన నుంచి నిర్మాణం వరకు, సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విధానం వరకు ప్రతి దశలో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.