మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్…
1,000 మంది అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుండి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ AAFAకు చెందిన దాదాపు 1,000 మంది సభ్యులతో ఆరు గంటలకు పైగా సమయాన్ని గడిపారు. వచ్చిన ప్రతీ అభిమానితో అల్లు అర్జున్ ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ విలువైన సలహాల్ని అందించారు. ప్రతీ ఒక్క సభ్యునికి అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఫోటోలను ఇచ్చారు.
అల్లు అర్జున్ తన ఫ్యాన్స్తో కలిసి నవ్వుతూ ముచ్చటించడమే కాకుండా కలిసి నృత్యం చేశారు. ఒకరినొకరు అభిప్రాయాల్ని పంచుకున్నారు. అల్లు అర్జున్ తన స్టైల్లో ప్రసంగాన్ని ఇస్తూ ఎన్నో చమత్కారాలు చేశారు. ఆ ప్రాంగణం, అక్కడి వాతావరణం ఒక సెలబ్రిటీ కార్యక్రమంలా కాకుండా ఫ్రెండ్స్ గెట్ టుగేదర్లా తలపించింది. ఇది తన జర్నీకి సపోర్ట్గా నిలిచిన అభిమానులతో ప్రత్యేక బంధాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన వెయ్యి మంది AAFA సభ్యులందరికీ బీమా కవరేజీని అందించారు. ఇది తన అభిమానుల సంక్షేమానికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యతను మరోసారి ధృవీకరించింది.
ఈ వేడుకలో పాల్గొనడానికి అభిమానులు ఏడు వేర్వేరు రాష్ట్రాల నుండి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. అల్లు అర్జున్ ఒక సినిమా ప్రమోషన్ కోసమో, ఒక బ్రాండ్ ఈవెంట్ కోసమో కాకుండా కేవలం అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికే రోజంతా వారికి కేటాయించారు.
సెలబ్రిటీలతో అభిమానులకు ముఖాముఖి అంటే కొన్ని నిమిషాలకే పరిమితమవుతూ ఉంటుంది. కానీ అల్లు అర్జున్ తన అత్యంత విలువైన సమయాన్ని అభిమానుల కోసం వెచ్చించారు. ప్రతి అభిమాని ఒక వ్యక్తిగత జ్ఞాపకంతో వెనుదిరిగి వెళ్లారు. అభిమాన హీరోతో హృదయపూర్వక సంభాషణ జరగడంతో వారి మనసు సంతృప్తితో నిండిపోయింది. తాము ఆరాదించే వ్యక్తితో కలిసి వేడుక జరుపుకుంటున్నామనే అనుభూతితో అభిమానులంతా వెనుదిరిగారు.
అభిమానులంటే అల్లు అర్జున్కి ఎంతో ప్రత్యేక బంధం ఉంటుందని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది. అది పరస్పర గౌరవం, ఆప్యాయత, ఏళ్ల తరబడి అచంచలమైన ప్రేమతో ఏర్పడింది. అభిమానులకు, అల్లు అర్జున్కి ప్రతీ ఏటా బంధం బలపడుతూనే ఉంది.



