Skip to content

‘ఈషా’ అందర్ని భయపెడుతుంది : శ్రీనివాస్‌ మన్నె

ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన 'కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈషా'. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి…

Read more

పాయల్ రాజ్‌పుత్ ‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్

‘ఆర్‌ఎక్స్‌ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిన‌ పాయల్‌ రాజ్‌పుత్ ఈ సారి ‘వెంకటలచ్చిమి’ గెట‌ప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాయల్‌ రాజ్‌పుత్ జన్మదినం సందర్భంగా డైరెక్ట‌ర్ ముని తెర‌కెక్కిస్తున్న ఆమె అప్ కమింగ్ మూవీ ‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. రాజా,పవన్ బండ్రేడ్డి నిర్మిస్తున్న‌ ‘వెంకటలచ్చిమి’ మూవీ బర్త్ డే పోస్టర్ లో హీరోయిన్‌ను ఒక జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడితీసి చేతికి సంకెళ్లు, మేడలో మంగళసూత్రం ఉంచినట్టు కనిపిస్తుంది. రక్తపు మరకలు, మద్యన భయానక వాతావరణం.. అన్ని కలిసి పోస్టర్‌కి ప‌వ‌ర్‌ఫుల్‌ టచ్‌ను ఇస్తున్నాయి…

Read more

లండ‌న్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో రాజ్‌, సిమ్రాన్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన షారూఖ్ ఖాన్‌, కాజోల్‌.

- లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే - ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా ఎక్కువ కాలం థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డ్డ చిత్రంలోని ఓ స‌న్నివేశాన్ని ప్ర‌తిబింబిస్తోన్న విగ్ర‌హం బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్‌లో కొత్త కంచు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆదిత్య చోప్ర తెర‌కెక్కించి దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా భార‌తీయ సినిమాల్లోనే అత్యంత ఆద‌ర‌ణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్‌, సిమ్రాన్ పాత్ర‌ల‌ను పోషించినందుకు వారి పాత్ర‌ల‌కు ద‌క్కిన గౌర‌వ‌మది. య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్స‌రాల‌ను పూర్తి…

Read more

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ ట్రైల‌ర్‌

ధనుష్, కృతి స‌న‌న్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్ మై’కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్ప‌టికే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ధ‌నుష్‌, కృతి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యి వారిని ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య ఉన్న ఎమోష‌న్స్, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఇలా అన్నీ క‌లిసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైల‌ర్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత‌గా పెరుగుతోంది. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌, కొన్ని ప‌రిస్థితుల్లో హీరో ప్రేమ‌ను కోల్పోవ‌టం, ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు రావ‌టం వంటి ఫీలింగ్స్‌ను…

Read more

హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం

- డిసెంబర్ 5 నుంచి 14 వరకు మూడు వేదికల్లో ప్రదర్శనలు హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF)–2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. “యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్‌ మద్దతు ఎంతో కీలకం,” అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్…

Read more

ఆది పినిశెట్టి “డ్రైవ్” టీజర్ రిలీజ్

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. "డ్రైవ్" సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. "డ్రైవ్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - తన తండ్రి స్థాపించిన ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుంటాడు హీరో ఆది పినిశెట్టి. సౌత్ ఇండియాలో పేరున్న ఈ సంస్థ అక్కౌంట్స్ ను ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ఈ హ్యాక్…

Read more

సైక్ సిద్ధార్థ’ సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: యామిని భాస్కర్

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల…

Read more

బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్

హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. ఈరోజు, సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు. హారిస్ జయరాజ్ స్వరపరిచిన పొమ్మంటే, మెలోడీ, ఎమోషన్ ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు, గాయకులు విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్ తో మరింత హార్ట్ టచ్చింగ్ గా మలిచారు…

Read more

హారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ అందరినీ భయపెడుతుంది : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు…

Read more

అవతార్: ఫైర్ అండ్ ఆష్” ప్రీమియర్‌

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌కు టెర్మినేటర్ నటుడు అర్నాల్డ్ ష్వార్జెనెగర్ తన మిత్రుడు జేమ్స్ కామెరాన్‌కు మద్దతుగా హాజరయ్యారు. ఇద్దరూ టెర్మినేటర్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేసిన దశాబ్దాల చరిత్రను పంచుకుంటున్నారు. ఇది యాక్షన్ సినిమాలో వారిని లెజెండ్స్‌గా నిలిపింది. ప్రీమియర్ వేడుక భారీ ఉత్సాహంతో నిండిపోయింది. ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన రిలీజ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు అభిమానులు, ఇండస్ట్రీ ఇన్‌సైడర్లు, మీడియాతో హోరెత్తించింది. కామెరాన్ సై-ఫై యూనివర్స్‌ను మరింత విస్తరించిన ఈ మూవీలో అద్భుతమైన విజువల్స్, ఎక్స్‌పాండెడ్ వరల్డ్‌బిల్డింగ్ ఉన్నాయి. ష్వార్జెనెగర్ రాకతో వేడుక మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అద్భుతమైన ముందస్తు స్పందనలు అందుకుంది. విమర్శకులు దాని అద్భుత విజువల్స్,…

Read more