Skip to content

‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’

‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’ Telugu News
‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’ Telugu News
‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’ Telugu News
‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’ Telugu News

తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్ని తాజాగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ చిత్రాల్ని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘దండోరా’కి అవార్డు వచ్చింది. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘దండోరా’ చిత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.

వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మంచి పేరు సంపాదిచుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలో రూపొందించిన ‘దండోరా’ చిత్రానికి తాజాగా గద్దర్ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు పోషించిన పాత్రలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మురళీకాంత్ రాసుకున్న కథ, చెప్పిన సందేశం ఆడియెన్స్‌ని కదిలించింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఈ చిత్రానికి పలు కాటగిరీల్లో గద్దర్ అవార్డుల్ని ప్రకటించింది.

సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా , శివాజీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మూడు కేటగిరీల్లో ‘దండోరా’ చిత్రం అవార్డుల్ని కొల్లగొట్టేసింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.