Skip to content

పర్సంటేజ్ సమస్యను హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సమంజసం కాదు * టికెట్ ధరలు పెంచి సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని దూరం చేయొద్దు * కోట్లు పెట్టాం, ఐదేళ్లు తీశామని చెబితే ప్రేక్షకుడు థియేటర్ ఎందుకు వస్తాడు -ఆర్. నారాయణమూర్తి

ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.... * రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవార్డులను తెలంగాణ…

Read more

రాజ్‌తరుణ్‌-విజయ్ మిల్టన్ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ముఖ్యపాత్రలో నటించనున్న ‘ప్రేమిస్తే’ భరత్‌

రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్‌ తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో 'ప్రేమిస్తే' భరత్‌ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది. కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్‌ అండ్‌ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్‌ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్‌ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్‌ ఇండియన్‌ రేంజ్‌…

Read more

భైరవం’ సినిమాని అందరూ థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా…

Read more

విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మహానాడు పర్వదిన సందర్బంగా వెంకటరమణ పసుపులేటి సృష్టించిన “ధర్మచక్రం “సినిమా ఆడియో విడుదల……

సంచలనాలకు తెర లేపబోతున్న ‘ధర్మచక్రం’ మూవీ చంద్రన్న చరిత్ర స్ఫూర్తితో SIFAA సంస్థ నిర్మాణం తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన…

Read more

నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్.. ఆకట్టుకునే విజువల్స్, ఆర్ఆర్*

రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను…

Read more

‘థగ్ లైఫ్’ చాలా గొప్ప సినిమా. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి తీసిన సినిమా. జూన్ 5న మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్' భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ లో…

Read more

“క” సినిమాకు గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న దర్శకద్వయం సందీప్, సుజీత్

కిరణ్ అబ్బవరం హీరోగా "క" చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు. "క" మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క" చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన "క" సినిమా బ్లాక్…

Read more

సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్

సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ... నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు…

Read more

నందమూరి తారకరాముడు అందరి గుండెల్లో ఉన్నాడు

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు 102వ జయంతి నేడు. తెలుగు ప్రజలంతా ఆయన జయంతిని సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇప్పటికీ కోట్లమంది హృదయాల్లో సజీవంగా ఉన్నారు. అన్ని దేవతా రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. వారు మన దేశం మూవీతో అడుగుపెట్టారు. నాదేశం సినిమాతో పూర్తవుతుందనుకున్నాం. కానీ మేజర్ చంద్రకాంత్ తో ముగించారు. ఆ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొన్నారు. ఎవరైనా…

Read more

వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతార’ చిత్రం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. 'మాస్ జాతర' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. 'మాస్ జతర' చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా 'మాస్ జాతర' రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను…

Read more